తల్లిదండ్రుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న అనుపమ.. ఏమిటంటే?

అనుపమ పరమేశ్వరన్ ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా ఎలాంటి సినిమాలు లేకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అయితే ఇప్పుడిప్పుడే వరుస సినిమాలు అందుకుని ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు.కార్తికేయ 2సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఇకపై ఈమె పాన్ ఇండియా సినిమాలలో నటించబోతున్నారని అభిమానులు భావించారు.

కార్తికేయ వంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి సినిమాలకు సైన్ చేయలేదు.

ఈ క్రమంలోనే అభిమానులు ఎంతో మంచి విజయాన్ని అందుకున్న అనుపమ పరమేశ్వరన్ కు అవకాశాలు రాకపోవడం ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు.

అయితే ఇండస్ట్రీ సమాచారం మేరకు ఇకపై అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదని ప్రస్తుతం ఆమె కమిట్ అయిన సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈమె ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నారని వార్త వైరల్ గా మారింది.

"""/"/ అనుపమ పరమేశ్వరన్ తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఈమె వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ కావాలనే ఆలోచనలో ఉన్నారట.

అనుపమ పరమేశ్వరన్ తల్లిదండ్రులు అనారోగ్యం బాగా లేకపోవడంతో వారిని సంతోష పెట్టాలన్న ఉద్దేశంతో వారి తల్లిదండ్రుల సూచన మేరకే ఈమె పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారనే వార్త వినపడుతోంది.

ఇది తెలిసిన అభిమానులు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్నటువంటి అనుపమ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈమె గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మహేష్ బాబు కృష్ణవంశీ కాంబో లో మిస్ అయిన మరో సినిమా ఏంటో తెలుసా..?