బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ..: మంత్రి పొన్నం

కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీపై( BJP ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన బీసీల( BC ) వ్యతిరేక పార్టీ బీజేపీ అని ఆరోపించారు.

రిజర్వేషన్లను ఎత్తివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే.

బీసీలు ఆగమవుతారని పేర్కొన్నారు.అయితే రిజర్వేషన్ల జోలికి ఎవరైనా వస్తే అంతు చూస్తామంటూ మంత్రి పొన్నం హెచ్చరించారు.

ఈ క్రమంలోనే బీజేపీని ప్రజలు నమ్మడం లేదన్న ఆయన రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ( Congress ) అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీజేపీకి అద్భుత ఫలితాలు..: కిషన్ రెడ్డి