జిల్లా కాంగ్రెస్ కమిటి ఉపాధ్యక్షులుగా అంతగిరి బాలపోచయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కాంగ్రెస్ కమిటి ఉపాధ్యాక్షుడుగా అంతగిరి బాలపోచయ్య ను , ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ కమిటి ప్రచార కమటి చైర్మన్ గా మాజీ ఎంపిపి గుడిసే అయిలయ్య లను మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు ఆది శ్రీనివాస్ ( Adi Srinivas )నియమించారు.

ఇరువురుకీ నియోజకవర్గ ఇంచార్జ్ జిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ యంపి పోన్నం ప్రభాకర్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ , డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియాజేశారు.

ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూంపల్లి రాఘవ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఏందయ్యా ఇది.. కొకెయిన్‌కు తినేస్తున్న సొరచేపలు.. సైంటిస్టులు షాక్??