దర్శకుడి కొడుకుతో పెళ్లిపీటలెక్కనున్న స్వీటీ బేబీ...

గత కొద్దికాలంగా టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి గురించి పలు కథనాలు బాగానే వైరల్ అవుతున్నాయి.

ఇందులో ఇప్పటికే అనుష్క భారత్ క్రికెట్ జట్టుకు చెందినటువంటి ఓ ప్రముఖ క్రికెటర్ తో ప్రేమాయణం నడుపుతోందని అంతేగాక అతడినే పెళ్లి పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా పలు రకాల వార్తలు గతంలో బలంగా వినిపించాయి.

అయితే ఈ మధ్య కాలంలో అనుష్క పెళ్లి గురించి మరో వార్త నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఇందులో భాగంగా టాలీవుడ్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి ఓ దర్శకుడి కొడుకుతో తొందర్లోనే అనుష్క పెళ్లి పీటలు ఎక్కనుందను టాలీవుడ్ సినీ వర్గాలు బలంగా గుసగుసలాడుకుంటున్నాయి.

అయితే అనుష్క కూడా ఈ దర్శకుడితో పలు చిత్రాలను చేసిందని కుటుంబ సభ్యుల అభిప్రాయాలు కలవడంతో దర్శకుడు కూడా అనుష్క తన కోడలుగా చేసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు.ఒకవేళ టాలీవుడ్ కి చెందిన దర్శకుల కొడుకుల్లో అనుష్క శెట్టి కి సరిపోయే వారసులు ఎవరూ దాదాపుగా లేరు.

దీంతో మరి ఎవరై ఉంటారా అని అనుష్క అభిమానులు తల పట్టుకుంటున్నారు.మరి కొందరైతే ఈ వార్తలను ఇవన్నీ అవాస్తవాలని కొట్టి పారేస్తున్నారు.

"""/"/ ప్రస్తుతం అనుష్క ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నటువంటి "నిశ్శబ్దం" అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంలో సీనియర్ నటుడు మాధవన్, శాలిని పాండే, తెలుగు భామ అంజలి, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో అనుష్క మూగ, చెవిటి సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నటువంటి  ఓ యువతి పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రం ఏప్రిల్ 2వ తారీఖున విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటన కూడా చేశారు.

రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైన జగన్.. వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలివే!