ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి సుప్రీం ధర్మాసనంలో పిటిషన్ వేశారు.

కాగా ఇప్పటికే అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం, రైతులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈనెల 31న అమరావతి రాజధాని కేసు విచారణ జరగనుంది.ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లను కలిపి విచారించే అవకాశం ఉంది.

ఈ కథానాయకులు ఇప్పుడు ప్రతినాయకులుగా చాలా బిజీ గా ఉన్నారు