సరూర్‎నగర్ మ్యాన్‎హోల్ మర్డర్ కేసులో మరో కొత్త కోణం

హైదరాబాద్ లోని సరూర్‎నగర్ మ్యాన్‎హోల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది.

తాజాగా మృతురాలు అప్సరకు మూడేళ్ల క్రితమే చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజాతో అప్సర వివాహం అయింది.

అయితే తాజాగా కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మీ ఓ ఆడియోను విడుదల చేశారని తెలుస్తోంది.

మహిళ హత్య గురించి మీడియా ద్వారా తెలుసుకున్నానన్న ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

పెళ్లి తరువాత తన కుమారుడిని మానసికంగా వేధించిందని, ఈ క్రమంలో వేధింపులు తాళలేక కార్తీక్ రాజా బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆడియోలో పేర్కొంది.

కార్తీక్ రాజా మరణం తరువాత అప్సర, ఆమె తల్లి కనిపించకుండా పోయారని వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్30, సోమవారం 2024