టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మరో డీఏ..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది.తమ ఉద్యోగులకు మరో విడత డీఏ (కరువు భత్యం) ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ మేరకు జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న ఐదు శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

అదేవిధంగా ఈనెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

పెండింగ్ లో ఉన్న ఎనిమిదవ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని సంస్థ నిర్ణయించిందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు బాగా పని చేస్తున్నారని ప్రశంసించిన ఆయన పెండింగ్ బకాయిలను కూడా త్వరలోనే ఇచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు.

దొంగతనానికి వచ్చాడు.. బుక్ కనిపించడంతో అది చదువుతూ చోరీ గురించే మర్చిపోయాడు..?