శ్రీకాకుళం జిల్లా మెట్టూరులోకి మరో ఎలుగుబంటి..!

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు ( Vajrapukottur )మండలంలో మరో ఎలుగుబంటి హల్ చల్ చేసింది.

ఇటీవలే మెట్టూరు గ్రామంలోని పాడుబడిన ఇంటిలోకి ప్రవేశించిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు బంధించిన సంగతి తెలిసిందే.

ఎలుగుబంటిని బంధించి 24 గంటలు కాకముందో మరో ఎలుగుబంటి గ్రామానికి సమీపంలోని జీడీ తోటలో కనిపించింది.

దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వరుసగా ఎలుగుబంట్లు గ్రామంలోకి వస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

ఈ క్రమంలో వన్యప్రాణులు గ్రామాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు( Forest Department Officials ) చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పవన్ మామ భారీ విజయం.. మొక్కు చెల్లించుకున్న మెగా మేనల్లుడు?