ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ఆప్ నేత..!!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో ఆప్ నేత చుట్టు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.

ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు నార్త్ అవెన్యూలోని సంజయ్ సింగ్ నివాసంలో ఉదయం నుంచి ఈడీ తనిఖీలు చేస్తోంది.

సీఆర్పీఎఫ్ భద్రత నడుమ ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.కేసులో నిందితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారి కీలక వివరాలు వెల్లడించారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని సమాచారం.

అయితే ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు జరిగిన వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ వివాదానికి వ్యతిరేకంగా సంజయ్ సింగ్ పోరాటం చేశారు.

దీంతో వర్షాకాల సమావేశాలు జరిగినన్నీ రోజులు ఆయన సస్పెండ్ కు గురైన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 8 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాగచైతన్య శోభిత… ఇదెక్కడి షాకింగ్ ట్విస్ట్!