తెలంగాణ పీసీసీ కార్యవర్గం ప్రకటన

తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది.ఈ క్రమంలో 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.

కాగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ గా మాణిక్కం ఠాగూర్ ను పార్టీ అధిష్టానం నియమించింది.

ప్రత్యేక ఆహ్వానితులుగా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండనున్నారు.40 మంది సభ్యులతో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండనుందని తెలిపింది.

ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి వ్యవహారించనున్నారని వెల్లడించింది.అదేవిధంగా 26 మంది డీసీసీ ప్రెసిడెంట్లతో పాటు 24 మంది వైస్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించింది.

84 మందిని జనరల్ సెక్రటరీలుగా నియమించింది.

కొత్తిమీరతో చర్మానికి మెరుగులు.. ఏ సమస్యకు ఎలా వాడాలో తెలుసా?