బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటిస్తున్నారు.

ఇందులో భాగంగా రెండు స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలిపారు.ఈ మేరకు గజ్వేల్ మరియు కామారెడ్డి నియోజకవర్గాల నుంచి తానే బరిలోకి దిగనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్ జాదవ్, నిర్మల్ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ నుంచి విఠల్ రెడ్డి, సిరిసిల్ల నుంచి కేటీఆర్ , వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి, కొడంగల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి, నారాయణ్ పేట్ నుంచి ఎస్ రాజేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కల్వకుర్తి జైపాల్ యాదవ్ తదితరులు బరిలోకి దిగనున్నారు.

ఇదీ ప్రభాస్ రేంజ్.. అక్కడ 10 సినిమాలలో 6 ప్రభాస్ సినిమాలు మాత్రమే ఉన్నాయా?