రేపు మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన

హైదరాబాద్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.మునుగోడు ఉపఎన్నికపై ప్రధానంగా ఈ సమీక్షలో చర్చించారు.

ఈ క్రమంలోనే రేపు మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు.రేపు దసరా పండుగను పురస్కరించుకుని జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న సంగతి తెలిసిందే.

అనంతరం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది.అయితే మునుగోడు బరిలో జాతీయపార్టీ బీఆర్ఎస్ గానే నిలబడాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.

అంతేకాకుండా నామినేషన్, చండూరు సభ తేదీలను కూడా ఆయన ఖరారు చేయనున్నారు.మునుగోడులో గెలుపు సాధించి జాతీయ పార్టీగా తొలి విజయాన్ని అందుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.

నామినేషన్ వేసే నాటికే బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఈ మేరకు నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు.

బాబోయ్, ఒకే స్టోరీతో ఇన్ని సినిమాలు తీస్తారా.. అవేంటో తెలిస్తే..