NDSA : ఎన్డీఎస్ఏ ఆదేశాలతో తెరుచుకున్న అన్నారం బ్యారేజ్ గేట్లు..!

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజ్ గేట్లు( Annaram Barrage Gates ) తెరుచుకున్నాయి.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ( National Dam Safety Authority )ఆదేశాల మేరకు అధికారులు గేట్లను ఓపెన్ చేశారు.

ఈ మేరకు బ్యారేజ్ లోని పది గేట్లు ఎత్తి సుమారు 13 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

సరస్వతి బ్యారేజ్ నుంచి ఈ నీళ్లు మేడిగడ్డలోకి చేరనున్నాయి.తరువాత మేడిగడ్డ గేట్లు ( Madigadda Gates )ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదలనున్నారు.

బ్యారేజ్ ఖాళీ చేసిన తరువాత ఎన్డీఎస్ఏ అధికారులు పరిశీలించనున్నారు.కాగా వారం రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం తెలంగాణకు రానుంది.

ఈ మేరకు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ను ఎన్డీఎస్ఏ పరిశీలించనుంది.

వారెవ్వా…నిజామాబాద్ లో దంపతుల హనీ ట్రాప్ దందా…!