శ్రీముఖి కి వెన్నుపోటు పొడిచిన బిగ్ బాస్ కంటెస్టెంట్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉన్నట్టే బుల్లితెరపై యాంకర్ల మధ్య కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది.

ఒక దశలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న యాంకర్లు తరువాత కాలంలో అవకాశాలు లేక టీవీ రంగానికి గుడ్ బై చెప్పేశారు.

కొత్త యాంకర్లు టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చే కొద్దీ పాతవాళ్లకు అవకాశాలు కనుమరుగవుతున్నాయి.

అయితే కొందరు యాంకర్లు మాత్రం ఎంతమంది యాంకర్లు వచ్చినా ప్రేక్షకుల్లో వచ్చిన గుర్తింపు ద్వారా ఉనికిని కాపాడుకుంటున్నారు.

అలా బుల్లితెరపై సత్తా చాటుతున్న లేడీ యాంకర్లు సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి.

యాంకర్ గా తక్కువ షోలే చేసినప్పటికీ పటాస్ షో శ్రీముఖికి తెచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు.

ఒసేయ్ రాములమ్మ సినిమా లో స్టెప్పులతో శ్రీముఖి చిన్న రాములమ్మగా పేరు తెచ్చుకుంది.

ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 3 లో అవకాశం రాగా శ్రీముఖి సీజన్ 3 విన్నర్ అవుతుందని భావించినా రన్నర్ గానే నిలిచింది.

బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత కొని నెలలు రెస్ట్ తీసుకున్న శ్రీముఖి మళ్లీ షోలు, ఈవెంట్లతో బిజీ అవుతోంది.

అలా బొమ్మ అదిరింది షోలో సోలో యాంకర్ గా శ్రీముఖికి అవకాశం వచ్చింది.

తన యాంకరింగ్ తో ఈ షోకు టీఆర్పీ రేటింగ్ పెంచడానికి శ్రీముఖి తనవంతు కృషి చేస్తోంది.

అయితే గతంలో ఇదే షో అదిరింది పేరుతో టెలీకాస్ట్ కాగా మొదట సమీర యాంకర్ గా, ఆ తరువాత రవి భాను శ్రీ యాంకర్లుగా వ్యవహరించారు.

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ భాను శ్రీ కొన్ని రోజుల క్రితం తనకు బొమ్మ అదిరింది షోకు యాంకర్ గా వ్యవహరించాలని ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేసింది.

నిన్న జీతెలుగు ఛానల్ లో ఒక ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్ లో శ్రీముఖి ప్రదీప్ కు రాసిన లెటర్ ని చెప్పి లెటర్ తీసుకుని బొమ్మ అదిరింది షోకు శ్రీముఖికి బదులుగా తనను తీసుకోవాలనే మీనింగ్ వచ్చేలా మార్చింది.

భాను శ్రీ కావాలనే చెప్పిందో లేక స్క్రిప్ట్ లో భాగంగా చెప్పిందో తెలీదు కాని శ్రీముఖి ఫ్యాన్స్ మాత్రం భాను శ్రీముఖికి కట్టప్పలా లెటర్ చదువుతానని చెప్పి వెన్నుపోటు పొడిచిందని అభిప్రాయపడుతున్నారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వైసీపీకే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వార్ వన్ సైడ్!