లంగా ఓణీలో అదుర్స్ అనిపిస్తున్న హాట్ యాంకర్...

నిత్యం పలురకాల షోలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉండే తెలుగు యాంకర్లలో యాంకర్ అనసూయ ఒకరు.

అయితే ఈ అమ్మడు ఓ పక్క టీవీ షోల్లో యాంకరింగ్ నిర్వహిస్తూ, మరోపక్క చిత్రాల్లో నటిస్తూ బిజీ షెడ్యూల్ తో గడుపుతోంది.

అంతేగాక ఈ అమ్మడు నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంటూ తన అందమైన ఫోటోలతో తన అభిమానులకు సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇంస్టాగ్రామ్ లో అందుబాటులో ఉంటోంది.

అయితే తాజాగా యాంకర్ అనసూయ ప్రముఖ ఫొటో షూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.

ఇందులో సాంప్రదాయ దుస్తులు  లంగా వోణీలో అదిరిపోయే లుక్ తో ఫోజులిచ్చింది.అలాగే ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో అనసూయ అందానికి అభిమానులు ఫిదా అయ్యారు.అంతేగాక నువ్వు టాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవు హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా అని సలహా ఇస్తున్నారు.

దీంతో యాంకర్ అనసూయ ఇంతగా తనని అభిమానిస్తూ ఆదరిస్తున్న టువంటి తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

"""/"/ అయితే ఇది ఇలా ఉండగా యాంకర్ అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ లోని ప్రముఖ స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రంలోని పలు సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

ఏదేమైనప్పటికీ యాంకర్ అనసూయ తన అందం అభినయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ లిస్టులో టాప్ లో కొనసాగుతోంది.

ఏపీ గవర్నర్ కి లేఖ రాసిన చంద్రబాబు..!!