ఆ విషయంలో నేను దారుణంగా దెబ్బతిన్నా.. యాంకర్ అనసూయ షాకింగ్ కామెంట్స్?

తెలుగు బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాను అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తాను నిరూపించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెర పై నటిగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

మొన్నటి వరకు జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వెండితెరపై సినిమా అవకాశాలు ఎక్కువ అవ్వడంతో రెండింటినీ బ్యాలెన్స్ చేయలేక జబర్దస్త్ గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే.

అనసూయ నటించిన రంగస్థలం పుష్ప లాంటి సినిమాలో ఆమెకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉటే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటించే అనసూయ తాజాగా ఒక పోస్ట్ పెట్టడంతో అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆ పోస్టులో అనసూయ ఈ విధంగా రాసుకొచ్చింది. """/"/ నేను దారుణంగా దెబ్బతిన్నాను.

నేను హర్ట్ అయినంతగా ఎవరినీ హర్ట్ చేయలేదు అని ఆ స్టోరీలో రాసుకొచ్చిందీ.

ఇది చూసిన పలువురు నెటిజన్స్ మిమ్మల్ని అంతగా ఎవరు హర్ట్ చేశారు మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా అనసూయ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది.

తనపై ట్రోలింగ్స్ చేసే వారికి తనదైనశైలిలో గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది.

యంగ్ టైగర్ దేవర సీక్వెల్ కు అసలు సమస్య ఇదేనా.. ఆ సమస్యలు తీరతాయా?