నన్ను అందరూ అలా మాత్రమే పిలవాలి.. అనసూయ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడినా ఏం చేసినా సంచలనం అవుతోందనే సంగతి తెలిసిందే.

ఆంటీ అంటూ కామెంట్ చేసిన వాళ్లపై అనసూయ ఫిర్యాదు చేయడం ఆ తర్వాత కొంతమంది అనసూయను కావాలనే ఆంటీ అని పిలవడం జరిగింది.

అయితే తాజాగా అనసూయ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ షోకు దూరమైన అనసూయ సినిమాలు, ఇతర ఆఫర్లతో బిజీ అవుతున్నారు.జబర్దస్త్ షోకు దూరం కావడం అనసూయకు మైనస్ అవుతుందే తప్ప ప్లస్ కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

యాంకర్ సుమ యూట్యూబ్ లో వంటల ఛానెల్ ను మొదలుపెట్టగా ఈ ఛానెల్ కు సంబంధించిన కార్యక్రమానికి అనసూయ అతిథిగా వచ్చారు.

సుమ అనసూయతో వంట చేయించడంతో పాటు వేర్వేరు ప్రశ్నలు అడిగారు.ట్విట్టర్ వార్ లోకి దిగిన తర్వాత నేను అత్తా అని పిలిపించుకోకూడదని రియలైజ్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.

"""/"/ నన్ను అందరూ స్టైల్ గా అనసూయ, అను అని పిలవాలని ఆమె కామెంట్ చేశారు.

చివరకు నా కోడలైనా కూడా నన్ను అలానే పిలవాలని అనసూయ చెప్పుకొచ్చారు.అయితే అనసూయ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

మీ అత్తగారిని కూడా నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావా అని కొంతమంది కామెంట్ చేస్తుండగా ఆంటీ అని పిలిస్తే నీ కోడలిపై కూడా కేసు పెడతావా అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు అనసూయకు సోషల్ మీడియాలో రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

అనసూయ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

అనసూయ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

గగనతలంలోనే అమ్మకి సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కొడుకు.. వైరల్ వీడియో..