బుల్లితెర రీ ఎంట్రీకి సిద్ధమైన అనసూయ…అలా క్లారిటీ ఇచ్చేసిందిగా?

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనసూయ ( Anasuya ) ఒకరు.

కెరియర్ మొదట్లో ఈమె యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండేవారు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి అనసూయ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇలా సినిమా అవకాశాలు రావడంతో పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి పరిమితమైనటువంటి అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే ఈమె తిరిగి బుల్లితెరపై సందడి చేస్తే చూడాలని ఎంతోమంది ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా అనసూయ బుల్లితెర పైకి రీ ఎంట్రీ గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా సోషల్ మీడియా( Social Media ) వేదికగా ఒక పోల్ నిర్వహించారు.

తాను తిరిగి బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నారా అంటూ ప్రశ్నించడంతో చాలామంది అవునని సమాధానం చెప్పారు.

అయితే ఏ కార్యక్రమాల ద్వారా ఆమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వాలి అనే విషయం గురించి కూడా ఒక పోల్ నిర్వహించారు.

ఇందులో దాదాపు 82 శాతం మంది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తిరిగి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు తెలియజేయడంతో అనసూయ వావ్ అంటూ సమాధానం చెప్పుకొచ్చారు.

"""/" / ఈ విధంగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకోవడంతో ఈమె కూడా ఆలోచనలో ఉన్నానని చెప్పారు అయితే అనసూయ ఇలా బుల్లితెర కార్యక్రమంలోకి రావాలని ఆలోచిస్తున్నారు అంటే తొందరలోనే ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తారని తెలుస్తుంది.

మొదటి నుంచి కూడా ఈమె తనకు సరైన అవకాశం వస్తే తిరిగి బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తానని చెప్పుకొస్తున్నారు.

అయితే త్వరలోనే అనసూయ తిరిగి యధావిధిగా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించనున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.

ఒకటి ముద్దు రెండు వద్దు… సీక్వెన్స్ ల పేరుతో ఫాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు