మంగళం శీను మీదేక్కి దాక్షాయిని రచ్చ రచ్చ.. నోట్లో బ్లేడుతో రచ్చ సీన్?

సుకుమార్,అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం పుష్ప.సుకుమార్,అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

పుష్ప సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు, టీజర్ లకు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ప్రస్తుతం ఈ ఈ పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.డిసెంబర్ 6న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా ఆ కాస్త ముందుగానే ఒక చిన్న శాంపిల్ ను వదిలారు.

ఈ వీడియోలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మీద రెండు షాట్లు కనిపించాయి.అలాగే ఇందులో దాక్షాయణి క్యారెక్టర్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయ మీద షార్ట్ పడింది.

మంగళ శీను క్యారెక్టర్ ను పోషిస్తున్న సునీల్ పై తన కోపాన్ని చూపించేస్తోందా అనేలా ఉంది.

"""/" / ఈ ఫోటోను చూసిన నెటిజన్ లకు పలు రకాల ప్రశ్నలు మొదలవుతున్నాయి.

పుష్ప సినిమాలో సునీల్ భార్యగా అనసూయ నటించిందా? సునీల్ పై అలా ఎందుకు ఎక్కింది? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అలా మొత్తానికి దాక్షాయణిగా అనసూయ అరాచకాలు సృష్టిస్తోంది.ఇక అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రకు ప్రాణం పోసింది.

పుష్ప సినిమాలో ఈమె పాత్రను బట్టి చూస్తే ఈ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకునే విధంగా కనిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు..: జూ.ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు