జానీ మాస్టర్ వల్లే ఇదంతా జరిగిందని చెబుతున్న అనసూయ..

యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగువారు ఉండరేమో.జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన ఈ భామ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతుంది.

తాజాగా కార్తికేయ హీరోగా నటించిన చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.

తాజాగా ఈ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసారు.పైన పటారం.

లోన లొటారం.అంటూ సాగే ఈ పాటలో అనసూయ ఎర్రచీరలో ఇరగదీసింది.

ఈ సినిమా కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కార్తికేయకు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో అనసూయ ఈ సాంగ్ గురించి మాట్లాడారు.ఈ సినిమాలో నటిస్తానని అస్సలు అనుకోలేదని చివరి నిముషంలో ఈ సినిమాను ఒప్పుకున్నానని అందుకు కొన్ని ఆసక్తి కారణాలు కూడా ఉన్నాయని అనసూయ చెప్పుకొచ్చారు.

ఈ సాంగ్ చేయడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపింది. """/"/ ఏ సాంగ్ షూటింగ్ చాలా వేగంగా జరిగిపోయిందని కేవలం 12 గంటల్లోనే ఈ పాట చిత్రీకరించడం పూర్తి అయ్యిందని చెప్పారు.

అయితే షూటింగ్ కి వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా అనిపించిందా జానీ మాస్టర్, కౌశిక్, కార్తికేయ అందరూ నన్ను ప్రోత్సహించడం వల్లే ఈ సాంగ్ లో నేను ఎంజాయ్ చేస్తూ నటించానని తెలిపింది.

అంతేకాదు కార్తికేయతో డాన్స్ చేయడం చాలా బాగుందని తెలిపారు.ఈ పాటలో మాస్ డాన్స్ చేయడం నా వళ్ళ కాదని జానీ మాస్టర్ కు చెబితే అంత నేను చూసుకుంటా అని భరోసా ఇవ్వడం వల్లే ఇంత మంచి పాట పూర్తి చేయగలిగానని.

ఈ పాట ఆడియన్స్ కు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను అని చెప్పారు.

Super Star Rajinikanth Wraps Lyca Productions “Vettaiyan”