విజయ్ దేవరకొండ హీరోయిన్ కు ఫ్యామిలీ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్.. కారణం?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం లైగర్.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మొట్ట మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

ఇదిలా ఉండగా అనన్య పాండే బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ జంటగా ‘‘ కాలీ పీలీ’’ అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని అప్పటి నుంచి వీరిద్దరూ రహస్యంగా వీరి ప్రేమ ప్రయాణం కొనసాగిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇకపోతే వీరి ప్రేమ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది.నూతన సంవత్సరం సందర్భంగా ఈ జంట రహస్యంగా రాజస్థాన్ లోని  రణతంబోర్ నేషనల్ పార్క్‌లో సెలబ్రేట్ చేసుకున్నారని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

అదేవిధంగా వీరిద్దరూ కలిసి ఆ పార్కులో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

అయితే ఈ ఫోటోలలో ఒకరు కనిపించకుండా మరొకరు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మీరు ఫోటోలు తీసుకున్నా ఆ ప్రదేశంలో ఒకే పోలికలు ఉండడంతో వీరిద్దరూ రహస్యంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నట్లు తెలుస్తోంది.

"""/" / అలాగే ఈ పార్కు నుంచి తిరిగి ఒకేసారి ముంబై ఎయిర్ పోర్టులో కనిపించడంతో ఈ విషయంపై మరింత అనుమానాలు చేకూరుస్తున్నాయి.

ఇలా వీరి గురించి మరోసారి ఇలాంటి వార్తలు షికార్లు చేయడంతో అనన్య పాండే కుటుంబసభ్యులు ఈ విషయం పై తనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే ఇషాన్ కుటుంబ సభ్యులకు కూడా అనన్య కుటుంబ సభ్యులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

పోలింగ్ సరళిపై మాజీ మంత్రి కేటీఆర్ సమీక్ష