ఆలోచింపజేస్తున్న ఆనంద్ మహీంద్ర ట్వీట్.. ఏం చెప్పారంటే..
TeluguStop.com
ఇండియన్ వ్యాపార దిగ్గజం అయిన ఆనంద్ మహీంద్రా నిత్యం ఏదో ఒక విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకుంటూనే ఉంటారు.
ఆయన ఎప్పటికప్పుడు కొత్త విషయాలను లేదంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ లను తన సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా షేర్ చేస్తూనే ఉంటారు.
మిగతా వ్యాపార వేత్తల కంటే కూడా ఆయనకే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ కూడా ఉంది.
ఇక ఎప్పటి లాగే ఇప్పుడు కూడా మరో వీడియోను పోస్టు చేసిన మహీంద్రా ఈ సారి కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
ఓ హైవేపై రాత్రిపూట రెండు పెద్ద పులులు సంచరిస్తున్నట్టు మనకు వీడియోలో కనిపిస్తోంది.
అయితే ఆ రెండు పులులను ఎంతో దగ్గరి నుంచి వీడియో తీసినట్టు తెలుస్తోంది.
అయితే ఇక్కడే ఆయన ఓ లాజిక్ ప్రదర్శించడంతో అటు ఆయన ఫ్యాన్స్ను ఫాలోవర్స్ నే కాకుండా ఇటు నెటిజనులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే అదే సమయంలో అది కాస్తా వారికి ప్రేరణనిచ్చేలా కూడా ఉంది.కాగా ఆ వీడియోతో ఆనంద్ మహీంద్రా తన బిజినెస్ సామ్రాజ్యంలో అత్యంత కీలకమైనటు వంటి ఎస్యూవీ ప్రమోషన్ కూడా చేసేసుకున్నారు.
"""/"/
అదేంటంటే ఆయన ఇచ్చిన క్యాప్షన్ పరిశీలిస్తే మన దేశంలోని హైవేలమీద మహీంద్ర ఎస్యూవీ వెహికల్స్ ఒక్కటే ఒక్కటే టైగర్ అనుకున్నా.
కానీ చలా బిగ్ కేట్స్ ఉన్నాయని తెలుస్తోందంటూ రాసుకొచ్చారు.ఇంకేముంది ఈ నెటిజనులకు ఇట్టే నచ్చుతోంది.
ఇక్కడ మరో చర్చ ఏం సాగుతోందంటే.అసలు అంత దగ్గరగా ఆ పులులను వీడియో ఎక్కడ తీసారు అసలు అది ఎలా సాధ్యమయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈనెల ఆగస్ట్ 19న మహాబలేశ్వర్ కు దగ్గర్లోని పంచగని హూవేమీద రాత్రిపూట ఈ పులల వీడియో తీసినట్టు తెలుస్తోంది.
82 సంవత్సరాల వయస్సులో సైతం వ్యాయామాలతో షాకిస్తున్న సుమ తల్లి.. ఏమైందంటే?