ట్రాక్టర్తో నిమిషాల్లో పాలు పితికిన రైతు.. ఎలా అంటే?
TeluguStop.com
ఏంటి ట్రాక్టర్ తో పాలు పితికాడా ? అది ఎలా అబ్బా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.
ఓ రైతు ఇంజినీర్ లా విన్నూతంగా ఆలోచించాడు.చేతులకు పని లేకుండా కాదు కాదు శారీరక శ్రమ లేకుండా ట్రాక్టర్ తో చిటికెలో ఆవు పాలు పితికిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో షేర్ చేసింది మరెవరో కాదు.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి తనకు నచ్చిన వీడియోలను నెటిజన్లతో పంచుకొనే మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్రనే ఇప్పుడు ఈ వీడియోను షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్రా వీడియోను షేర్ చేస్తూ ''గ్రామాల్లో మా ట్రాక్టర్లను మల్టీ టాస్క్లుగా ఉపయోగిస్తున్న వీడియోలను ప్రజలు నాకు తరచు పంపిస్తున్నారు.
అందులో ఇది నాకు కొత్తగా అనిపించింది.ఇంజనీర్ కానీవారు ఇలా చేయగలరా'' అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు.
1.12 నిముషాలు ఉన్న ఆ వీడియోలో మహారాష్ట్రకు చెందిన రైతు ట్రాక్టర్ సాయంతో పాలను పితికే విధానాన్ని వివరించాడు.
నాబ్లను ఉపయోగించి ట్రాక్టర్ ఇంజన్ సాయంతో 2, 3 నిమిషాలలో పాలను పితకచ్చు అని చెప్పాడు.
ఇంకా ఈ వీడియోను చుసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు పాల రేటు కంటే ఎక్కువ ఖర్చు పాలు పితకడానికే అవుతుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.
సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ నినాదాలు.. 2034లో తారక్ నిజంగానే సీఎం అవుతారా?