ఒక్క కొడుకుంటే కీడట…కీడుకు విరుగుడు గాజులట…?

నల్లగొండ జిల్లా:తెలంగాణలో వ్యాప్తంగా ప్రస్తుతం ఒక వింత ఆచారం వెలుగులోకి వచ్చింది.ఎవరికైనా ఒక్క కొడుకు ఉంటే ఇంటికి కీడుఅంట.

ఆ కీడుకు విరుగుడు ఇద్దరు కొడుకులు ఉన్న వారు ఒక్క కొడుకు ఉన్నవారికి గాజులు వేయించాలట.

ఇప్పుడు ఈ "గాజుల కానుక"( Gajula Kanuka ) ప్రచారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు కొడుకులు ఉన్న ఐదుగురి మహిళల వద్ద డబ్బులు తీసుకుని,ఐదు రకాల గాజులు వేసుకోవాలనే మూఢ నమ్మకం ట్రెండింగ్ లో కొచ్చింది.

ఈ సంప్రదాయం ఫాలో కాని ఎడల కీడు జరుగుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు ఆడపడుచులు.

ఇప్పుడు తెలంగాణలో( Telangana ) ఎక్కడ చూసినా గాజుల చర్చే సాగుతోంది.దాంతో మూఢ నమ్మకాల పుణ్యమాని గాజుల దుకాణ దారులకు భలే గిరాకీ తగిలింది.

గాజులకు కూడా డిమాండ్ పెరిగింది.కాగా ఈ మూఢ ప్రచారాన్ని నిపుణులు.

కొట్టిపారేస్తున్నారు.ఇలాంటి మూఢ నమ్మకాలని నమ్మొద్దని సూచిస్తున్నారు.

ఏదేమైనా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు మహిళలు.

అన్నను నిర్మాతగా నిలబెడుతున్న ఎన్టీఆర్.. భారీ లాభాలను అందిస్తున్నాడుగా!