అనంతగిరి మండలంలో మంత్రాల నెపంతో వృద్ధురాలు ఆటవిక హత్య

సూర్యాపేట జిల్లా:మనిషి సైన్స్ పై పరిశోధనలు చేస్తూ అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఆధునిక సమాజంలో కూడా ఇంకా చేతబడి,బాణామతి,సిల్లంగి వంటి మూఢనమ్మకాల పేరుతో ఆటవిక హత్యలు జరగడం మానవ సమాజానికి సిగ్గు చేటుగా చెప్పుకోవాలి.

ఇలాంటి ఒక అనాగరిక సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురారం గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.త్రిపురారం గ్రామానికి చెందిన కొమ్ము అలివేలమ్మ (70)భర్త నరసయ్య చేతబడి పేరుతో మంత్రాలు చేస్తుందని భావించిన అదే గ్రామానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తి తన స్నేహితునితో కలసి సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అలివేలమ్మ మెడకు తాడు బిగించి అత్యంత పాశవికంగా హత్య చేశారు.

మృతురాలి మనవడు సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనంతగిరి ఎస్ఐ జి.

అజయ్ కుమార్ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ .. పుతిన్ దండయాత్రలు, యుద్ధాలు చేయగలిగాడా : నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు