అంతర్జాతీయ డ్రగ్స్, వ్యభిచారం ముఠా గుట్టురట్టు

అంతర్జాతీయ డ్రగ్స్, వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది.ఈ నేపథ్యంలో డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారంలోకి దింపుతున్న 17 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెబ్ సైట్ లో బుక్ చేసుకున్న వారికి ఈ ముఠా యువతులను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

1,419 మంది బాధితులను విముక్తి కల్పించారు.ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై సహా బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, రష్యాకు చెందిన బాధితులకు విముక్తి కల్పించారు పోలీసులు.

ఒక్క హైదరాబాద్ లోనే 950 మంది యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ తెలిపారు.

15 నగరాల యువతులతో ఈ రాకెట్ ను నడిపిస్తున్న ముఠా విమానాల్లో యువతులను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ మంత్రి జూపల్లిపై ఈసీకి ఫిర్యాదు