రంగారెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

గురునానక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న వంశీ అనే విద్యార్థి క్యాంపస్ లోనే పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వెంటనే గమనించిన విద్యార్థులు, కాలేజీ సిబ్బంది బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కాగా వంశీకి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వంశీ పటేల్ కాలేజీలో సీఎస్ఈ మూడవ సంవత్సరం చదువుతున్నాడని సమాచారం.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

నేడే దాయాదుల పోరు.. తప్పక గెలవాల్సిందే.. లేకపోతే ఇంటికే