నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలో ప్రమాదం.. ఒకరు మృతి

నెల్లూరు జిల్లాలోని రాపూరు సమీపంలో ప్రమాదం జరిగింది.ప్రమాదవశాత్తు అదుపుతప్పిన ఆటో కండలేరు సాయిగంగ కాలువలోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా మరొకరు క్షేమంగా బయటపడ్డారు.సైదాపురం మండలం కలిచేడుకు చెందిన భార్యాభర్తలు దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

భార్య మృతి చెందగా.భర్త క్షేమంగా బయటపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటోను బయటకు తీశారు.

కొత్త బడ్జెట్‌ లో ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుందంటే?