అమ్మోరు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి….

తెలుగులో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అప్పట్లో దర్శకత్వం వహించిన "అమ్మోరు" అనే చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.

అయితే ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో స్వర్గీయ నటి సౌందర్య, సీనియర్ హీరో సురేష్ నటించగా కళ్ళు చిదంబరం, రామి రెడ్డి, సునయన చైల్డ్ ఆర్టిస్ట్, రమ్య కృష్ణ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన టువంటి ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులని నమోదు చేసింది.

అయితే ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సునయన అప్పట్లోనే తన నటన ప్రతిభ కి సినీ విమర్శకుల నుంచి మంచి విమర్శలే అందుకుంది.

అయితే చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగానే అలరించిన సునయన బాదాం ఈ మధ్యకాలంలో  యూట్యూబ్ లో ప్రస్టేటెడ్ ఉమెన్ పేరుతో వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.

అంతేకాక ఇటీవలే  టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన టువంటి ఓహ్ బేబీ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి  సునయన ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తున్నటువంటి ఉద్యోగిని పెళ్లి చేసుకుంది.

 ప్రస్తుతం వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.అయితే ఈ మధ్య సునయన తెలుగు బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో  నాలుగో సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ గా పాల్గొంటున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

గాయాన్ని మొక్కతో నయం చేసుకుంటున్న ఒరంగుటాన్.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు..