మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ అంటున్న అమిత్ షా..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు.సరిహద్దులలో ఉగ్ర దాడులు ఆపకపోతే మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

గతంలో భారత బలగాలు పాకిస్తాన్ భూభాగంలో కి వెళ్లి.మటు పెట్టడం జరిగిందని.

మళ్లీ అటువంటి పరిస్థితిని తీసుకురావద్దని పాకిస్తాన్ నీ హెచ్చరించారు.గోవా పర్యటనలో భాగంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

పుంచ్ లో.అప్పట్లో పాకిస్తాన్ చేసిన దాడులకు భారత్ ఏ విధంగా సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా కౌంటర్ అటాక్ ఇవ్వటం జరిగిందో.

అదేరీతిలో మళ్లీ సీన్ రిపీట్ అవుతుందని.పాకిస్తాన్ ని అమిత్ షా హెచ్చరించడం జరిగింది.

ఇటీవల భారత్ సరిహద్దులలో ఉగ్రవాదులు చొరబడటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో.అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఉగ్ర దాడులను అరికట్టడానికి.భారత సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

సరిహద్దులలో చొరబాట్లను.సహించేది లేదని పేర్కొన్నారు.

జమ్మూకాశ్మీర్లో ఇటీవల.ఉగ్ర దాడులు బాగా పెరిగిపోతున్నాయి.

ఈ దాడులలో ఎనిమిది మంది సాధారణ పౌరులు మరణించడం జరిగింది.దీంతో కేంద్ర ప్రభుత్వం అదనపు బలగాలను జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దింపాయి.

ఇటువంటి తరుణంలో తాజాగా అమిత్ షా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇస్తూ సర్జికల్ స్ట్రైక్ మళ్లీ చేపడతామని హెచ్చరించడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.

టాలీవుడ్ నంబర్ వన్ హీరో మళ్లీ అతనే.. ఆర్మాక్స్ లేటెస్ట్ సర్వే వివరాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!