తెలుగు రాష్ట్రాల సమస్యలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఆదివారం తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో.
ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై ప్రశ్నించడం జరిగింది.ఈ సందర్భంగా అమిత్ షా రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు.
ఇరు రాష్ట్రాలకు చెందిన సమస్యలు కేవలం రాష్ట్రాలకు చెందినవి మాత్రమే కాక జాతీయ అంశాలనీ కూడా ప్రస్తావించారు.
సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటామని.తప్పకుండా పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అంతమాత్రమే కాకుండా సమావేశం అనంతరం ట్విట్టర్ వేదికగా కూడా షా స్పందించారు.‘దక్షిణాది రాష్ట్రాల 51 అంశాలలో 40 పరిష్కారమయ్యాయి’ అని కేంద్ర మంత్రి షా ట్వీట్ చేశారు.
ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ సమస్యలను కేంద్ర మంత్రి, సదరన్ జోనల్ కౌన్సిల్ చైర్మన్ అమిత్ షాకు విన్నవించుకున్నాయి.
చాలా సమస్యలకు షా సానుకూలంగానే స్పందించడం జాతీయ రాజకీయాలలో సంచలనంగా మారింది. దక్షిణాది సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.
ఆ రోజులు నా జీవితంలో చీకటి రోజులు.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!