హైద‌రాబాద్ చేరుకున్న అమిత్ షా.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన పార్టీ శ్రేణులు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భాగ్య‌న‌గ‌రానికి చేరుకున్నారు.బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయ‌న‌కు.

కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్, పార్టీ స్టేట్ ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్ లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.

అక్క‌డి నుంచి స్థానిక‌ బీజేపీ నేత‌ల‌తో క‌లిసి సికింద్రాబాద్ లోని ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించారు.

అనంత‌రం అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.అయితే, మునుగోడులో సాయంత్రం జ‌ర‌గ‌నున్న బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు అమిత్ షా హాజ‌రుకానున్న సంగ‌తి తెలిసిందే.

వెంకటేష్ అనిల్ రావిపూడి తో మళ్ళీ రోటీన్ సినిమానే చేస్తున్నాడా..?