అంబేద్కర్ నగర్ పీ.హెచ్.సీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పీ.

హెచ్.సీ ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Sandeep Kumar Jha ) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు.

ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని డాక్టర్ కృష్ణవేణి( Dr.

Krishnaveni ) ని అడుగగా, మొత్తం 34 లక్ష్యం కాగా, ఇప్పటిదాకా 24 పూర్తి చేశామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు.

ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫ్లాప్ హీరోయిన్ కు మరో ఛాన్స్.. అల్లరోడు అయినా ఈ బ్యూటీకి హిట్ ఇస్తారా?