ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామస్తులు వివిధ సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు యూత్ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు వివిధ సంఘాల నాయకులు మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ నడుస్తూ ఆయన ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు,జై భీమ్ యూత్ నాయకులు గడ్డం జితేందర్,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,వెంకటేష్,కొత్త చెన్నయ్య, నీలేష్, కృష్ణ రెడ్డి,వార్డ్ మెంబర్స్,వివిధ యూత్ సంఘాల నాయకులు,వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పూరి జగన్నాథ్ ప్లాప్స్ కి కారణం ఎవరు..?ఇక ఆయన సినీ కెరియర్ ముగిసినట్టేనా..?