వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అంబేద్కర్ 132 వజయంతి వేడుకలను ఘనంగా జరిపారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే కొందరివాడు కాదు అందరివాడు అని అన్నారు.

హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

అంబేద్కర్ అంటే కొందరు ఫోటోలకు విగ్రహాలకే పరిమితం చేస్తారు కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నారని అన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు26, సోమవారం 2024