రక్తనాళాలలోనీ కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ పండు తినండి..!
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజల రక్తనాళాలలో కొలెస్ట్రాల్ సమస్య( Bad Cholesterol )తో ఇబ్బంది పడుతున్నారు అలాంటివారు విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఉన్న పండ్లను తీసుకుంటూ ఉండాలి.
ఇలాంటి పోషకాన్ని కృష్ణ ఫలం లో ఉన్నాయి.కృష్ణ ఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఈ పండు లోపల గింజలు కూడా ఎక్కువే ఉంటాయి.కృష్ణ ఫలాలు ఊదా, పసుపు రంగులలో లభిస్తాయి.
ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"""/"/
ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణ ఫలం( Passion Fruit ) లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి, పాలీ ఫినాల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.
దీర్ఘకాలిక రోగాల ముప్పును దూరం చేస్తాయి.అలాగే కృష్ణఫలం తక్కువ గ్లెసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది.
అంటే వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగావు.డయాబెటిస్ రోగులు కూడా దీన్ని తినవచ్చు.
అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.దీంతో ఎక్కువసేపు కడుపు నిండినట్టు ఉంటుంది.
పైగా మలబద్దకం నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. """/"/ కృష్ణ ఫలాలలోని( Krishna Fal ) యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఇతర మూలకాల కారణంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటుంది.ఇది గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.
అలాగే ఇవి రక్తనాళాలలో కొలెస్ట్రాల్( Cholestrol ) పేరగకుండా నియంత్రిస్తాయి.ఫైబర్ మన పొట్టకు ప్రీబయోటిక్లా పని చేస్తుంది.
అలాగే ఇది పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది.ఇది మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తుంది.
ఈ పండును తొక్క తీసి నేరుగా తినవచ్చు.యోగర్ట్తో కలుపుకుని కూడా తినవచ్చు.
ఇతర పండ్లతో కలిపి స్మూతీగా తినవచ్చు
.
India-Israel Maitri Project : ఇజ్రాయెల్లో భారతీయ ఇన్ఫ్లూయెన్సర్ల పర్యటన