జాతీయస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లే యోచనలో అమరావతి రైతులు..!
TeluguStop.com
తూళ్లూరులో అమరావతి రైతులు సమావేశం అయ్యారు.అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
ఉద్యమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని రైతులు తీర్మానించారని తెలుస్తోంది.
రాజధానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున ఢిల్లీలో ప్రదర్శన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో ధర్మాసనం తుది తీర్పు వెలువరించే వరకు ఉద్యమం కొనసాగించాలని రైతులు నిశ్చయించుకున్నారు.
కాగా డిసెంబర్ 17తో అమరావతి రైతుల ఉద్యమానికి మూడు సంవత్సరాలు పూర్తి కానున్నాయి.
మహేష్ రిజక్ట్ చేసిన కథ తో వంశీ పైడి పల్లి ఈసారి హిట్ కొడతాడా..?