మళ్లీ మొదలుపెట్టి అదుర్స్ అనిపిస్తానంటోన్న అల్లుడు

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవాలని ఈ యంగ్ హీరో భావిస్తున్నాడు.

కాగా ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.గతంలో కందిరీగ, రభస వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ మరోసారి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ను వాయిదా వేసుకుంది.

కాగా ఈ లాక్‌డౌన్ సమయంలో సినిమా కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా హీరో సాయి శ్రీనివాస్ కోరాడట.

కొన్ని సీన్స్‌లో సినిమా కథ రొటీన్‌గా ఉందని హీరో భావించడంతో, అక్కడ మార్పులు చేయాల్సిందిగా డైరెక్టర్‌ను కోరాడట.

దీంతో సంతోష్ శ్రీనివాస్ కూడా మార్పులు చేసేందుకు ఓకే అన్నాడట.తన గత చిత్రం ‘రాక్షసుడు’తో తొలి కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అల్లుడు అదుర్స్‌తో తన సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటిస్తుండగా జి.

సుబ్రహ్మణ్యం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ ఎలాంటి మార్పులు చేయమన్నాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

అప్పుడే ముహూర్తం పెట్టేసారా ? మీరు మాములోళ్లు కాదు సామి