పుష్ప విలన్‌పై మరీ ఎక్కువ అంచనాలు పెంచేస్తున్నారు

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ పుష్ప.

ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు నటించబోతున్నట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది.

కరోనా కారణంగా దాదాపు ఏడు నెలల పాటు షూటింగ్‌ ఆగిపోయింది.ఎట్టకేలకు పరిస్థితులు కుదుట పడుతున్న నేపథ్యంలో ఈ నెలలో షూటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సమయంలో హైదరాబాద్ వచ్చి షూటింగ్‌ చేసేందుకు కొందరు బాలీవుడ్ నటులు ఆసక్తి చూపడం లేదు.

ముఖ్యంగా విలన్ పాత్రలు చేసే ఇద్దరు ముగ్గురు స్టార్స్‌ మాత్రం అసలు ఈ సమయంలో బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

ఆ కారణంగా ఈ సినిమా కోసం తమిళ నటుడుని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారు.

తమిళంలో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సూపర్ హిట్ సినిమాలను చేస్తున్నాడు.

ఇలాంటి సమయంలో ఆయన ఈ సినిమాలో నటించడమే కాకుండా తమిళం హిందీ కన్నడం లో సందేహం లేకుండా ఆకట్టుకుంటుంది.

ఆయన నటన మరియు బాడీ లాంగ్వేజ్ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.కనుక ఆయన ఉంటే కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నాడు.

ఇంతకు ఆ నటుడు ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు.సినిమా విలన్ విషయంలో అంచనాలు భారీగా పెంచేస్తున్నారు.

మరి ఈ అంచనాలను అందుకుంటారా లేదంటే కింద పడిపోతారా అనేది చూడాలి.ఈ సినిమాలో హీరోయిన్‌ గా రష్మిక మందన నటిస్తుంది.

చిత్తూరు పల్లెటూరు అమ్మాయిగా ఆమె కనిపించబోతుంది.ఇకై ప్రత్యేకమైన ఐటెం పాటను బాలీవుడ్‌ బ్యూటీతో చేయించబోతున్నారట.

ఈ సినిమాను వచ్చే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

ప్రచారంలో స్పీడ్ పెంచిన ఏపీ సీఎం జగన్..!!