అల్లు అర్జున్‌ పుష్ప 2 కోసం కొత్త విధానం.. బాలీవుడ్‌ స్టైల్‌ పద్దతి ఫాలో

అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కి గత సంవత్సరం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు పుష్ప కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రూపొందుతోంది.ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత పుష్ప రష్యన్ లాంగ్వేజ్ రిలీజ్ కోసం రష్యా కి చిత్ర యూనిట్ సభ్యులు అంతా వెళ్లారు.

అక్కడ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.వచ్చే వారం ఇండియా కు తిరిగి వచ్చి వెంటనే షూటింగ్ లో జాయిన్ అవుతారట.

కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాకుండా హీరోయిన్ రష్మిక మందాన కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది.

ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు అనే విషయం లో ఒక క్లారిటీ లేదు.

"""/"/ కానీ సినిమాల్లో ఇప్పుడు కొనసాగుతున్న కొత్త పద్ధతి ని అల్లు అర్జున్ ఫాలో అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

కేవలం పాతిక కోట్ల రూపాయల పారితోషకం తీసుకుని ఆ తర్వాత సినిమా కి వచ్చే కలెక్షన్స్ జరిగే బిజినెస్ మరియు లాభాలు ఇలా అన్నింటిని బేరీజ్‌ వేసుకుని వాటా తీసుకోబోతున్నాడట.

సినిమా నష్టపోయినా కూడా అల్లు అర్జున్ కి మరో 30 నుండి 35 కోట్ల రూపాయలు వచ్చే విధంగా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా ఫలితం తో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు బాలీవుడ్‌ హీరోలు.

అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు, వచ్చే సంవత్సరం డిసెంబర్ లో ఈ సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.

పుష్ప 2 కూడా అదే స్థాయిలో ఉంటే బన్నీ మరియు సుకుమార్ లు పాన్ ఇండియా స్టార్ లు అయ్యే అవకాశం ఉంది.

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో విచారణ