పుష్ప 2 కోసం ఆ పని మొదలైందన్న సుకుమార్‌

అదుగో ఇదుగో అంటూ ఊరిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలను అతి త్వరలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మొన్నటి వరకు స్క్రిప్ట్‌ వర్క్ లో సుకుమార్‌ బిజీగా ఉన్నాడు.ఒక మాట చెప్పాలంటే ఇంకా కూడా స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతూనే ఉంది.

అయితే దాదాపుగా స్క్రిప్ట్‌ రెడీ అవ్వడం వల్ల దర్శకుడు సుకుమార్‌ ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.

మొన్నటికి మొన్న రెండు మూడు ట్యూన్స్ ను దేవి శ్రీ ప్రసాద్‌ తో రెడీ చేయించాడు.

ఆ ట్యూన్స్ మంచి మాస్ గా ఉన్నాయంటూ సుకుమార్‌ భావించడంతో పాటు అల్లు అర్జున్‌ కూడా విన్నాడట.

తాజాగా అల్లు అర్జున్‌ విన్న నేపథ్యంలో దేవి శ్రీ ప్రసాద్‌ మరింత జోరు గా పాటల ట్యూన్స్ పని మీద ఉన్నాడట.

పుష్ప సాంగ్స్ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే.అందుకే ఇప్పుడు పుష్ప 2 యొక్క మ్యూజిక్‌ ఆల్బమ్‌ పై అంచనాలు భారీ గా ఉన్నాయి.

ఐటెం సాంగ్ మొదలుకుని ప్రతి ఒక్క పాట కూడా అద్భుతం అన్నట్లుగా పుష్ప లో ఉన్నాయి.

అందుకే పుష్ప 2 లో కూడా అదే స్థాయి పాటలు.అంతకు మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

మొత్తానికి పుష్ప 2 సినిమా యొక్క అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. """/" / అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో పాటు పుష్ప 2 సరికొత్త అవార్డులను మరియు రివార్డులను కూడా దక్కించుకుంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

పుష్ప 2 ను జాతీయ స్థాయి లో విడుదల చేయడం ద్వారా వెయ్యి కోట్ల రికార్డు పై దర్శకుడు సుకుమార్‌ కన్ను వేశాడు.

కనుక ఆ స్థాయి సాధ్యం అయ్యేనా చూడాలి.అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నా కాకుండా బాలీవుడ్‌ స్టార్స్ ను ఈ సినిమా లో నటింపజేయబోతున్నారు అనేది టాక్.

నేడు ఏపీ లో ప్రధాని మోదీ ఎన్నికల టూర్ .. షెడ్యూల్ ఇదే