ఒకే వేదిక మీద అల్లు అర్జున్, బాలకృష్ణ..!

నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద కనబడనున్నారు.

అదేంటి అల్లు అర్జున్, బాలకృష్ణ ఒకే స్టేజ్ మీద అది ఎలా సాధ్యం అని అనుకోవచ్చు.

బాలయ్య బాబు బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న అఖండ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు.సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా 27న శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఈ ఈవెంట్ కు గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారని తెలుస్తుంది.

అల్లు అర్జున్, బాలకృష్ణ ఇది ఖచ్చితంగా డిఫరెంట్ కాంబో కాని సినిమా పరిశ్రమ అంతా ఒక్కటే అనేలా ఈ కాంబో రాబోతుంది.

బోయపాటి శ్రీనుతో సరైనోడు సినిమా తీసి హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్.అందుకే బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీని గెస్ట్ గా తీసుకొస్తున్నారు.

అదీగాకా బాలయ్య బాబు ఈమధ్య ఆహా కోసం అన్ స్టాపబుల్ షో చేసిన విషయం తెలిసిందే.

అందుకే బాలకృష్ణ సినిమాకు అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది.మరి ఈ వేడుక కోసం అటు నందమూర్ ఫ్యాన్స్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

హిందీ బెల్ట్ లో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ తోపు.. అసలేం జరిగిందంటే?