Allu Arjun : అప్పుడే ఎందుకు బన్నీ? ఓటీటీలో షో చేసే టైమ్ చాలా ఉందిగా.. ఈ ప్రయోగాలు ఎందుకో!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

పుష్ప పార్ట్ 2 సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.పుష్ప 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

అదేమిటంటే బన్నీ ఓటీటీ ( OTT )లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. """/" / అయితే ఇప్పటివరకు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్ ఇప్పుడు డిజిటల్ లో కూడా సందడి చేయబోతున్నాడు.

ఓటీటీ మాధ్యమంలో ఒక షోని చేయబోతున్నారు అల్లు అర్జున్.సొంత ఓటీటీ సంస్థ అయినా ఆహాలో( Aha ) అల్లు అర్జున్ షోని చేయబోతున్నారు.

ఇదే విషయాన్ని ఆహా స్వయంగా ప్రకటించింది.ఈ సందర్భంగా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని మీరు క్లాస్ గా, మాస్ గా చూసి ఉంటారు.

ఈసారి ఒక్క బ్లాక్ బస్టర్ లుక్ తో ఆహా మీ ముందుకు తీసుకురాబోతోంది.

బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ కి రెడీగా ఉండండి అని రాసుకొచ్చింది.ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసింది.

"""/" / ఇక ఈ వార్త విన్న అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇదే విషయంపై కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా తన పిల్లలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్ 2 పై భారీగా అంచనాలు నెలకొనడంతో సుకుమార్ కూడా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్కింగ్ రూల్ బ్రేక్ చేసింది.. రూ.11 లక్షల జరిమానా విధించడంతో..?