వరుడు కావలెను కోసం స్పెషల్ గెస్ట్ గా బన్నీ..?

నాగశౌర్య రీతూవర్మ ల కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా వరుడు కావలెను.

ఈ ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది.పి డి వి ప్రసాద్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్,ఫస్ట్ లుక్, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గానే స్పందన లభించింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మూవీ మేకర్స్ కాస్త వినూత్నంగా ఇటీవలే సంగీత్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

"""/"/ ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పూజా హెగ్డే వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవలే జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ను రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై హైప్ బాగా ఏర్పడింది.

దీంతో ఈ చిత్ర యూనిట్ రకరకాల ప్రమోషన్స్ ను చేస్తోంది.మొదట ట్రైలర్ లాంచ్ అనే ఈవెంట్ ను పెట్టి, ఆ తర్వాత సంగీత్ ఈవెంట్ అంటూ మరో కార్యక్రమాన్ని చేశారు.

అలా మరొక సారి మళ్ళీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టబోతోంది.తాజాగా ఈ సినిమా హీరో హీరోయిన్ లు ఒక పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశ్చర్యపరిచారు.

అక్టోబర్ 29న రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ను రిలీజ్ చేశారు.

ఈ వరుడు కావలెను సినిమా ఈవెంట్ కు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు.

అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమా దారుణంగా బెడిసికొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే.

“ఆచార్య”కి ముందు చిరంజీవి కెరీర్‌లోనే ది వరస్ట్ సినిమాలు అంటే ఇవే!