విశ్వక్ సేన్, ఆ ఛానల్ మధ్య గొడవను ప్రముఖ నిర్మాత సెటిల్ చేశారా.. ఏమైందంటే?

కొన్ని రోజుల క్రితం ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ కు విశ్వక్ సేన్ కు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ గొడవ విషయంలో ఎక్కువ మంది టీవీ ఛానల్ నిర్వాహకులదే తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ గొడవ వల్ల సదరు టీవీ ఛానల్ పై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.

సినీ ప్రముఖులు సైతం ఈ గొడవ విషయంలో కలుగజేసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు.కొందరు సినీ ప్రముఖులు విశ్వక్ సేన్ కు మద్దతు ప్రకటించినా సదరు ఛానల్ కు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడలేదు.

అయితే ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ విశ్వక్ సేన్ కు ఆ ఛానల్ కు మధ్య జరిగిన గొడవను సెటిల్ చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఈ గొడవ వల్ల అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు భారీస్థాయిలో పబ్లిసిటీ జరగడంతో పాటు సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

"""/"/ అయితే న్యూస్ ఛానల్ తో గొడవ హీరోకు మంచిది కాదు.అదే సమయంలో హీరోలతో విభేదాల వల్ల ఛానల్ పాపులారిటీపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది.

అయితే అల్లు అరవింద్ ఈ వివాదంలో జోక్యం చేసుకుని నచ్చజెప్పారని తెలుస్తోంది.అల్లు అరవింద్ ఈ విధంగా చేసి మంచి పని చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రాబోయే రోజుల్లో ఆ ఛానల్ లో విశ్వక్ సేన్ కనిపించినా ఆశ్చర్యానికి గురి కానవసరం లేదు.

మరోవైపు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా సెకండ్ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ వీకెండ్ నాటికి అన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

ఆ వైసీపీ నేతను గెలిపించండి.. ఆ నేతకు అండగా దిల్ రాజు!