‘సడక్‌ 2’ విడుదల తర్వాతా వదల్లేదు

సుశాంత్‌ మృతి కారణంగా బాలీవుడ్‌ లో స్టార్‌ వారసులు తీవ్రంగా నెపొటిజం విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ జాబితాలో ఆలియా భట్‌ ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.ఈమె సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ సంఖ్య లక్షల్లో తగ్గడంతో పాటు ఈమె నటించిన సడక్‌ 2 సినిమాకు చాలా గట్టి దెబ్బ తగిలింది.

ముఖ్యంగా ఈమె తండ్రి మహేష్‌ భట్‌ సడక్‌ 2 సినిమాకు దర్శకత్వం వహించడం కారణంగా సుశాంత్‌ అభిమానులు ఆ సినిమాను టార్గెట్‌ చేశారు.

ఇప్పటికే సడక్‌ 2 సినిమా ట్రైలర్‌ కు ప్రంపంచంలోనే అత్యంత చెత్త రికార్డును కట్టబెట్టిన విషయం తెల్సిందే.

యూట్యూబ్‌ లో దాదాపుగా మూడు మిలియన్‌ ల డిస్‌ లైక్స్‌ వచ్చాయి.ఈ స్థాయి డిస్‌ లైక్స్‌ రావడం ప్రపంచ చకరిత్రలోనే మొదటి సారి.

ఇంతగా చెత్త రికార్డును దక్కించుకున్న ఆలియా భట్‌ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

సినిమా విడుదల తర్వాత కూడా సుశాంత్‌ ఫ్యాన్స్‌ సినిమాను వదిలి పెట్టలేదు. """/"/ సుశాంత్‌ మృతికి కారణం మహేష్‌ భట్‌ అంటూ వాదన వినిపిస్తున్న కారణంగా సడక్‌ 2 సినిమాకు ఐఎండీబీ రేటింగ్‌ కేవలం 1 నమోదు అయ్యింది.

ఎంత చెత్త సినిమాలు అయినా కూడా పది రేటింగ్‌ కు కనీసం నాలుగు అయిదు రేటింగ్‌ వస్తుంది.

కాని ఇండియన్‌ సినీ చరిత్రలో ఏ సినిమాకు 1 రేటింగ్‌ రాలేదు.అది సడక్‌ 2 కు నమోదు అయ్యింది.

ఇటీవలే ఒక ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాను జనాలు చూడటం లేదు అనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

మొత్తానికి ఈ సినిమాకు సుశాంత్‌ మృతి దెబ్బ గట్టిగా పడ్డట్లయ్యింది.

హాస్య చక్రవర్తికి జేజేలు… 50 ఏళ్లపాటు నవ్వులు పూయించిన మహానుబావుడు!