ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. భర్తను గుర్తు చేసుకుంటూ అలేఖ్యా రెడ్డి ఎమోషనల్!

నందమూరి తారకరత్న( Nandamuri Taraka Ratna ) భార్య అలేఖ్యారెడ్డి( Alekhya Reddy ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తారకరత్న మరణం తర్వాత సోషల్ మీడియాలో చేసే పోస్ట్ ల ద్వారా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.

పిల్లల పుట్టినరోజు సందర్భంలో తారకరత్నను మరోమారు గుర్తు చేసుకుని అలేఖ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి ఆనంద సమయంలో మీరు లేరని అలేఖ్య కామెంట్ చేశారు. """/" / భౌతికంగా తారకరత్న లేకపోయినా పిల్లల ముఖంలో నవ్వు రూపంలో ఎప్పుడూ ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు.

అలా తారకరత్న మాతోనే ఉంటారని ఆమె కామెంట్లు చేశారు.ఇంద్ర ధనస్సు కంటే తారకరత్న చాలా అందంగా ఉన్నారని పొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాసంగా ఉన్నారని తారకరత్నను నేను, పిల్లలు చాలా ప్రేమిస్తున్నామని ఆమె కామెంట్లు చేశారు.

మీరు సంతోషాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను వేడుకలను రెట్టింపు చేయలని కోరుకుంటున్నానని అలేఖ్యారెడ్డి ( Alekhya Reddy )తెలిపారు.

అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.ఈరోజు తారకరత్న అలేఖ్యల కొడుకులైన తాన్యారామ్, రేయాల పుట్టినరోజు కావడంతో అలేఖ్యారెడ్డి ఈ కామెంట్లు చేశారు.

అలేఖ్యకు దేవుడు మంచి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. """/" / కెరీర్ పరంగా అలేఖ్యారెడ్డి మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని పిల్లలను ప్రయోజకులను చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అలేఖ్యారెడ్డి కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా బాలయ్య ( Nandamuri Balakrishna )ఆర్థిక సహాయం చేస్తున్నారని తెలుస్తోంది.

అలేఖ్యారెడ్డి కుటుంబానికి తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు.తారకరత్నకు సంబంధించిన పలు వ్యాపారాల బాధ్యతలను సైతం అలేఖ్యా రెడ్డి చూసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

అయితే నందమూరి కుటుంబానికి సంబంధించిన ఈవెంట్లలో అలేఖ్యా రెడ్డి కనిపించడం లేదు.అలేఖ్యా రెడ్డి పిల్లలు భవిష్యత్తులో మంచి నటులు అవుతారని నందమూరి ఫ్యాన్స్( Nandamuri Fans ) ఫీలవుతున్నారు.

దేవర సీక్వెల్ కు మూహూర్తం ఫిక్స్ అయిందట.. 2025లోనే తారక్ శుభవార్త చెప్పనున్నారా?