‘అల వైకుంఠపురములో’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

త్రివిక్రమ్ కంటెంట్‌కు ఆడియెన్స్ కనెక్ట్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఈ సినిమా ఏ,బీ,సీ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్‌లోనూ హౌజ్‌ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది.

అల్లు అర్జున్ యాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్‌, థమన్ మ్యూజిక్‌కు జనాలు ఫిదా అవుతున్నారు.

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా శుక్రవారం మధ్యాహ్నం వరకు రూ.

70 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిందని తెలుస్తోంది.కొన్ని ఏరియాల్లో ఈ సినిమా అప్పుడే బ్రేక్ ఈవెన్‌కు కూడా చేరుకుంది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో బన్నీ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.ఈ సినిమా విజయోత్సవ వేడుకలు ఈ నెల 19న వైజాగ్‌లో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై సంచలన తీర్పు