అభిమానులకు ఝలక్ ఇచ్చిన సమంత… అది ఏంటంటే?

సమంత.తన నటనతో అందరి మనసులను దోచుకున్న ముద్దుగుమ్మ.

తెలుగు, తమిళ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.అక్కినేని వారి కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తను పెళ్ళికిముందు ఎన్నో సినిమాల్లో నటించి తన పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతటితో ముగించక పెళ్లి తర్వాత కూడా తన నటనతో, అందంతో మరింత గ్లామర్ బ్యూటీ గా కనబడుతుంది.

తాజాగా కొన్ని షో లలో కూడా చేస్తుంది.రియాలిటీ షో బిగ్ బాస్ లో తన మామగారి నాగార్జున బదులు చివరి వారం ఎపిసోడ్ లో సమంత హోస్టింగ్ చేయగా ఆ వారం ఎపిసోడ్ టీఆర్పీ పెంచుకుంది.

ఈ ముద్దుగుమ్మ తన నటనతోనే కాకుండా కొన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ప్రేక్షకులని మరింత ఆకర్షిస్తుంది.

"""/"/ కాగా ఇప్పటివరకు ప్రతి సినిమాలలో ప్రత్యేక పాత్ర హీరోయిన్ గా నటించిన సమంత.

ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి సమంత ఆసక్తి చూపడంతో ప్రేక్షకులకు ఆశ్చర్యం అనిపించింది.

అంతేకాకుండా అందులో తాను విలన్ పాత్రలో నటిస్తుందని వార్తలు రాగా సమంత విలన్ పాత్ర లో నటిస్తుందని తెలియగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.

రాజ్, డీ కే దర్శకత్వంలో హిందీ లో వస్తున్న "ది ఫ్యామిలీ మాన్ టూ" యాక్షన్ సీన్ తో కూడిన ఇందులో మనోజ్ బాజ్ పెయ్, ప్రియమణి, సందీప్ కిషన్ తో పాటు సమంత అందులో విలన్ పాత్రలో నటిస్తుందని తెలిపారు.

ఇందులో ఉన్న కథ,విలన్ పాత్ర సమంతకు ఆకర్షించడంతో ఆ పాత్రకు ఆసక్తి చూపిందని తెలిపారు.

కాగా షూటింగ్ పూర్తి అవ్వగా విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం ఆహా లో వస్తున్న షో "సామ్ జామ్" లో నటీనటులను, ఇతర రంగాలకు చెందిన వాళ్లని ఇంటర్వ్యూ చేస్తూ మరిన్ని విషయాలు తెలుసుకొని తన అల్లరితో షో లో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

ఎన్నికలవేళ పవన్ కళ్యాణ్ పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!!