అక్కినేని ఫ్యాన్స్‌కు అమితానందం ఇచ్చే వార్త ఇది

అక్కినేని నాగచైతన్య మరియు ఆయన భార్య సమంత కలిసి 'మజిలీ' చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.

చైతూ మరియు సమంతల కాంబో గత కొంత కాలంగా సక్సెస్‌ అవుతూనే ఉంది.

వీరు కలిసి నటించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కనుక వీరిద్దరి కాంబోకు విపరీతమైన డిమాండ్‌ ఉంది.మజిలీ సినిమాలో వీరిద్దరు కలిసి నటించినందుకు గాను భారీ రెమ్యూనరేషన్‌ ప్యాకేజ్‌ను దక్కించుకున్నట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి.

"""/" /మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఫ్యాన్స్‌ వీరిద్దరి కాంబో సినిమాలను విపరీతంగా కోరుకుంటున్నారు.

అందుకే వీరిద్దరు కూడా తమ అభిమానుల కోసం సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకే వచ్చే ఏడాది అంటే 2020లో కూడా వీరిద్దరి కాంబోలో మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నాగచైతన్య ఇటీవలే పరుశురామ్‌ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. """/" /గీత గోవిందం వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా తర్వాత పరుశురామ్‌ చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో ఈ చిత్రంపై చాలా అంచనాలున్నాయి.

ఇలాంటి సినిమాలో చైతూకు జోడీగా సమంత నటిస్తే మరింత బాగుంటుందనే ఉద్దేశ్యంతో నిర్మాతలు సమంతను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నాగచైతన్య మరియు సమంతల జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తే ఖచ్చితంగా సక్సెస్‌ గ్యారెంటీ అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లయి పిల్లలు ఉంటే ఇంట్లోనే ఉండాలా… వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన అనసూయ?